Omicron: దేశంలోకి ‘ఒమిక్రాన్’
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలోనూ బయటపడ్డాయి. తొలిసారిగా.. కర్ణాటకలో ఇద్దరు పురుషుల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. ఈ ఇద్దరిలోనూ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశంలో కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియమ్ ‘ఇన్సాకోగ్’ ఈ కేసులను గుర్తించినట్లు చెప్పారు. కర్ణాటకలో వెలుగు చూసిన
బెంగళూరులో 2 కేసులు
బాధితుల్లో ఒకరు దక్షిణాఫ్రికా వాసి
బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళకు పాజిటివ్.. సీసీఎంబీకి నమూనాలు
ఈనాడు డిజిటల్, బెంగళూరు / దిల్లీ
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలోనూ బయటపడ్డాయి. తొలిసారిగా.. కర్ణాటకలో ఇద్దరు పురుషుల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. ఈ ఇద్దరిలోనూ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ దిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దేశంలో కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించే కన్సార్షియమ్ ‘ఇన్సాకోగ్’ ఈ కేసులను గుర్తించినట్లు చెప్పారు. కర్ణాటకలో వెలుగు చూసిన ఒమిక్రాన్ కేసులకు సంబంధించి.. ఒకరు దక్షిణాఫ్రికా వాసి (66) కాగా, మరొకరు బెంగళూరుకు చెందిన వ్యక్తి (46)గా బృహత్ బెంగళూరు మహానగర పాలికె చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా తెలిపారు. నవంబరు 20న నగరానికి వచ్చిన దక్షిణాఫ్రికా వాసికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో పాజిటివ్ తేలడంతో నేరుగా ఓ హోటల్లో క్వారంటైన్ చేసినట్లు గుప్తా వివరించారు. మూడు రోజుల తర్వాత పరీక్షల్లో నెగెటివ్గా తేలడంతో ఆయనను డిశ్ఛార్జ్ చేశారు. అనంతరం నగరంలోని ఓ కంపెనీ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన మరోసారి కరోనా పరీక్ష చేయించుకోగా మళ్లీ నెగటివ్ రావడంతో నవంబరు 27న దుబాయ్ వెళ్లిపోయినట్లు గుప్తా తెలిపారు. దక్షిణాఫ్రికా వాసి శాంపిల్ను జన్యుక్రమ పరిశీలనకు పంపించగా కొత్త వేరియంట్గా గురువారం రిపోర్టు వచ్చినట్లు చెప్పారు. అలాగే ఒమిక్రాన్ సోకినట్లు తేలిన బెంగళూరు వాసి స్థానికంగా ఓ ఆసుపత్రిలో మత్తు వైద్య నిపుణుడుగా పనిచేస్తున్నారు. ఆయన ఎలాంటి విదేశీ ప్రయాణం చేయలేదు. నవంబరు 22న ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ రావడంతో శాంపిల్ను జన్యుక్రమ పరిశీలనకు పంపారు. ఆయనకు సోకింది ఒమిక్రాన్గా తేలడంతో ఆయనను ముందు ఇంటివద్ద ఐసొలేషన్లో ఉంచి అనంతరం ఆసుపత్రికి తరలించగా కోలుకుంటున్నట్లు గుప్తా తెలిపారు. వీరిద్దరితో దగ్గరగా మెలిగిన దాదాపు 500 మందికి (ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్) జరిపిన పరీక్షల్లో ఇంతవరకు ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ ఐదుగురు కూడా బెంగళూరు వాసికి దగ్గరగా ఉన్న వారేనని (ప్రైమరీ-3, సెకండరీ-2 కాంటాక్ట్స్) గుప్తా వెల్లడించారు. విదేశీయాన చరిత్ర లేనప్పటికీ బెంగళూరు వాసికి ఒమిక్రాన్ సోకిందని.. అందువల్ల కొత్త వేరియంట్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒమిక్రాన్ సోకిన ఇద్దరూ రెండు డోసుల కొవిడ్ టీకా కూడా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
దేశంలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అయితే అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ స్పష్టం చేశారు. కొవిడ్ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలన్నారు. వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయడం తక్షణ అవసరమని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో టీకాలు తీసుకోవడంలో ఎవరూ జాప్యం చేయవద్దన్నారు. ముప్పు ఉన్నట్లు భావిస్తున్న దేశాల నుంచి 7,976 మంది ప్రయాణికులు వచ్చారని.. వారిలో 10 మంది పాజిటివ్గా తేలడంతో జన్యుక్రమ పరిశీలనకు పంపించినట్లు తెలిపారు. బ్రిటన్ సహా ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్లను ముప్పు ఉన్న దేశాలుగా గుర్తించారు.
లాక్డౌన్ అవసరం లేదు..
దేశంలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో లాక్డౌన్ విధించే అవకాశం ఉందా? అన్న విషయమై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అవసరమేమీ లేదని చెప్పారు. దేశంలో కొవిడ్ పరిస్థితి అదుపులోనే ఉందని, భయాందోళనలు అవసరం లేదన్నారు. 18 ఏళ్లు పైబడినవారిలో 84.3% మంది కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారని, 49% రెండో డోసు కూడా పొందినట్లు అగర్వాల్ వివరించారు. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్ను కలిగిస్తుందన్నదీ లేనిదీ ఇప్పటికిప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు.
హైదరాబాద్లో అప్రమత్తం..
ఈనాడు, హైదరాబాద్: బ్రిటిష్ ఎయిర్వేయిస్ ద్వారా 206 మంది ప్రయాణికులు బుధవారం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా వీరికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మహిళ(35)కు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ముప్పు ఉన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి కావడంతో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఆ మహిళను అత్యవసరంగా గచ్చిబౌలిలోని టిమ్స్కు తరలించి, ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ మహిళ నుంచి నమూనాలను జన్యుక్రమ పరిశీలనకు గాను హైదరాబాద్లోని సీసీఎంబీకి పంపించారు. ఈ ఫలితం వచ్చిన తర్వాత ఆమెకు సోకింది డెల్టానా? ఒమిక్రాన్ వేరియంటా? అనేది తెలుస్తుందని వైద్యవర్గాలు తెలిపాయి. శుక్ర, శనివారాల్లో ఈ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆమెతో పాటు ప్రయాణించిన మిగిలిన ప్రయాణికులకు, అదేరోజు సింగపూర్ ఎయిర్లైన్స్లో వచ్చిన 119 మందికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అందరిలోనూ నెగిటివ్గా ఫలితం వెల్లడైనట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం