AP News: ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు బాధ కలిగించింది: బొత్స
ఏపీలో పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు చాలా బాధ కలిగించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అమరావతి: ఏపీలో పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు తీర్పు చాలా బాధ కలిగించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దీనిపై ఉన్నత న్యాయస్థానానికి ఆశ్రయిస్తామని చెప్పారు. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రభుత్వ వివరణ తీసుకోకుండానే తీర్పు ఇవ్వడం బాధాకరమన్నారు. ‘‘ప్రతి మహిళ ఇంటి యజమానిగా ఉండాలనే ఇళ్ల పథకం తీసుకొచ్చాం. కోర్టు తీర్పులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు. కేంద్ర విధివిధానాలతోనే ఇళ్ల పథకం చేపట్టాం.
రాజ్యాంగ విరుద్ధంగా ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నాం. ఇళ్ల పథకాన్ని అడ్డుకుంటే ప్రజలకు దిక్కెవరు?రాజ్యాంగబద్ధంగానే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం’’ అని బొత్స అన్నారు. ఇళ్ల నిర్మాణానికి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలు సరిపోవని, ఈ విషయంలో ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని హైకోర్టు నిన్న సూచించిన విషయం తెలిసిందే. ఆ ప్రక్రియ ముగిసే వరకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని తీర్పు చెప్పింది.
గతంలో ఎవరూ పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు: సుచరిత
మరోవైపు, పేదల ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం అప్పీల్కు వెళ్తుందని ఏపీ హోంమంత్రి సుచరిత స్పష్టంచేశారు. గతంలో ఎవరూ పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. ఒకే గదిలో ఉంటూ అద్దె ఇళ్లలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలపై వంకలు పెట్టడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్