Covid Vaccine: 50%పైగా వయోజనులకు వ్యాక్సినేషన్‌ పూర్తి!

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నాటికి మొత్తం 127.66కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం ఒక్క రోజే కోటి డోసులు ఇచ్చామని ప్రకటించింది. ఒక్క రోజులో కోటి వ్యాక్సిన్లు పంపిణీ చేయడం ఇది ఆరోసారని

Published : 05 Dec 2021 12:58 IST

దిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నాటికి మొత్తం 127.66కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం ఒక్క రోజే కోటి డోసులు ఇచ్చామని ప్రకటించింది. ఒక్క రోజులో కోటి వ్యాక్సిన్లు పంపిణీ చేయడం ఇది ఆరోసారి అని పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు 47.59కోట్ల మంది రెండు డోసులూ పూర్తి చేసుకున్నారు. దేశ వయోజనుల జనాభాలో 50శాతం మందికిపైగా రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌ చేశారు. ‘‘అర్హత గల వారిలో 50శాతానికిపైగా వయోజనులు రెండు డోసులు తీసుకోవడం గొప్ప విషయం. మరో మైలురాయిని చేరుకున్నందుకు భారతదేశానికి అభినందనలు. కరోనా మహమ్మారిపై పోరులో మనమంతా కలిసే విజయం సాధిస్తాం’’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట్లో కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సినేషన్‌ చేపట్టారు. ఆ తర్వాత క్రమంగా ప్రజలందరికీ వ్యాక్సిన్‌ వేయడం మొదలైంది. అక్టోబర్‌ నెలలో భారత్‌.. 100కోట్ల వ్యాక్సినేషన్‌ మైలు రాయిని చేరుకుంది. భారతీయులందరికీ వ్యాక్సిన్‌ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని