Omicron: ఒమిక్రాన్.. యువతకే ఎక్కువ సోకుతోంది: దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరిస్తుండటమే కారణం. ఇప్పటికే ఒమిక్రాన్ 20 దేశాలకు పాకినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఈ వేరియంట్పై శాస్త్రవేత్తలు పరిశోధనలను ముమ్మరం చేసినా ఫలితం కనిపించట్లేదు. ఇప్పట్లో
కేప్టౌన్: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఒమిక్రాన్ 20 దేశాలకు పాకినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఈ వేరియంట్పై వైద్యశాస్త్రవేత్తలు పరిశోధనలను ముమ్మరం చేసినా ఫలితం కనిపించట్లేదు. ఇప్పట్లో దీని గురించి ఏమీ చెప్పలేమని అంటున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కూడా ఇదే మాట చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం కష్టతరంగా ఉందని వెల్లడించారు. ‘ప్రస్తుతం ఈ వైరస్ ఎక్కువగా యువతకే సోకుతోంది. వారికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో తీవ్రత తెలియట్లేదు. ఇప్పుడు ఈ వైరస్ పెద్దవారికి సోకుతుండటం గమనించాం. అయితే, వారిలో తీవ్రమైన సమస్యలు కొన్ని వారాల వరకు కనిపించకపోవచ్చు’ అని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు.
రోగనిరోధక శక్తి తగ్గుతుంది.. కానీ!
ఒకవైపు ఒమిక్రాన్ తీవ్రతను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. మ్యూటెషన్ ప్రొఫైల్, వైరస్ స్వరూపాన్ని పరిశీలించగా.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతున్నట్లు తేలిందని వెల్లడించారు. అయితే, కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న వారికి ఒమిక్రాన్ నుంచి రక్షణ లభిస్తుందని చెప్పారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్