Omicron: ఒమిక్రాన్ బాధితుల్లో స్వల్ప లక్షణాలు..!
సార్స్కోవ్-2 కొత్త మ్యూటేషన్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ సోకిన రోగుల్లో స్వల్పలక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని.. వారికి ఇంటి వద్దనే ఉంచి చికిత్సను అందించవచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన ఒక డాక్టర్ వెల్లడించారు.
వెల్లడించిన దక్షిణాఫ్రికా డాక్టర్
ఇంటర్నెట్డెస్క్: సార్స్కోవ్-2 కొత్త మ్యూటేషన్ ‘ఒమిక్రాన్’ వేరియంట్ సోకిన రోగుల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని.. వారిని ఇంటి వద్దే ఉంచి చికిత్స అందించొచ్చని దక్షిణాఫ్రికాకు చెందిన ఒక డాక్టర్ వెల్లడించారు. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ ఓ ఆంగ్ల వార్తా సంస్థ వద్ద ఈ విషయాన్ని వెల్లడించారు. కోయెట్జీ దక్షిణాఫ్రికా వ్యాక్సిన్ కమిటీలో సభ్యురాలు కూడా. కొత్త వేరియంట్ను తొలిదశలో అనుమానించిన వారిలో ఆమె కూడా ఒకరు. డెల్టా వేరియంట్ కంటే భిన్నమైన లక్షణాలతో ఏడుగురు పేషెంట్లు వచ్చినట్లు వెల్లడించారు. వీరిందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని పేర్కొన్నారు. ఈ ఘటన నవంబర్ 18న జరిగినట్లు వివరించారు. నవంబర్ 25న దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్ఐసీడీ) సంస్థ ఒమిక్రాన్ వేరియంట్ వివరాలను వెల్లడించింది.
ఈ విషయమై కోయెట్జీ మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన పేషెంట్లు తీవ్రమైన ఒళ్లునొప్పులు, తలనొప్పితో రెండ్రోజులు బాధపడ్డారని పేర్కొన్నారు. ‘‘ఆ సమయంలో వారి లక్షణాలు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలను పోలి ఉన్నాయి. అప్పటికి 10 వారాల వరకు మా ప్రాంతంలో కొవిడ్ కేసులు రాలేదు. దీంతో వారికి పరీక్షలు చేయించాలని నిర్ణయించాం. ఆ పేషెంట్, వారి కుటుంబ సభ్యులకూ వైరస్ సోకింది. అదే రోజు అటువంటి లక్షణాలతో మరికొంత మంది పేషెంట్లు వచ్చారు. ఏదో మార్పు వచ్చినట్లు అనుమానించాను. ఆ తర్వాత ఎన్ఐసీడీని అదే రోజు అప్రమత్తం చేశాను. ఆ తర్వాత నిత్యం ఇద్దరు లేదా ముగ్గురు కొవిడ్ పేషెంట్లు నా క్లినిక్కు రావడం మొదలైంది. వారందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. ఆ పేషెంట్లను ఇంటి వద్ద ఉంచే చికిత్స అందించాం. వాసన, రుచి పోవడం, ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం వంటి లక్షణాలు కనిపించలేదు’’ అని పేర్కొన్నారు.
పీసీఆర్ పరీక్షల్లో గుర్తించవచ్చు: ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా కొత్త వేరియంట్ను గుర్తించే అంశంపై ఆదివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేసింది. దీనిని కూడా ఇతర వేరియంట్ల వలే పీసీఆర్ పరీక్షల్లో గుర్తించవచ్చని వెల్లడించింది. ఇతర పరీక్షల ఫలితాలను ఒమిక్రాన్ వేరియంట్ ఏమేరకు ప్రభావితం చేస్తోందనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ వేరియంట్ వ్యాప్తి వేగం ఏ స్థాయిలో ఉందనే అంశంపై , రోగ లక్షణాల తీవ్రతపై పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపింది. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు మిగిలిన వాటికంటే ఎంత భిన్నంగా ఉంటాయో కూడా చెప్పేందుకు తగినంత సమాచారం లేదని పేర్కొంది. కాకపోతే గతంలో కొవిడ్ బారినపడిన వారు కూడా మరోసారి ఒమిక్రాన్ బారిన పడేందుకు అవకాశం ఉందనటానికి ఆధారాలు లభించాయని వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ఒమిక్రాన్ వేరియంట్ను ‘ఆందోళనకర వేరియంట్’గా ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు వెలుగు చూసినా ఆల్ఫా,బీటా,గామా వేరియంట్లకంటే ప్రమాదకరమైన జాబితాలోకి చేరింది. ఈ జాబితాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ మాత్రమే ఉంది. ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. కాలంతో పోటీపడి దీనిని అడ్డుకోవాలని ఐరోపా సమాఖ్య చీఫ్ వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
ఎన్నికల వేళ.. రాజస్థాన్లోని బన్స్వారా నియోజకవర్గంలోని పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. తమ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపట్టింది. -
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
Nitin Gadkari: లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభలో మాట్లాడుతూ స్పృహతప్పి పడిపోయారు. -
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
స్క్రాప్ మెటీరియల్ మాఫియా ద్వారా రూ.కోట్లు ఆర్జించిన గ్యాంగ్స్టర్ రవికానా, అతడి ప్రియురాలిని థాయ్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court: ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
Rahul Gandhi: ఎన్నికల మేనిఫెస్టోలో తాము ప్రతిపాదించిన ‘సామాజిక - ఆర్థిక సర్వే’ కేవలం అన్యాయాన్ని అంచనా వేయడానికి మాత్రమేనని రాహుల్ గాంధీ అన్నారు. చర్యలు తీసుకోవడానికి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. -
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
వారసత్వ పన్ను గురించి శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ (Modi) చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ మరింత ఇరకాటంలో పడింది. -
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
మన దేశ ఎన్నికలపై విదేశీ మీడియా స్పందించడానికి గల కారణాన్ని కేంద్రమంత్రి జై శంకర్ (S Jaishankar) వెల్లడించారు. -
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
శామ్ పిట్రోడా (Sam Pitroda) తన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని వివాదంలోకి నెట్టారు. దాంతో ఇప్పుడు హస్తం పార్టీ వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. -
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
Patanjali: సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పతంజలి సంస్థ మరోసారి వార్తాపత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు తెలియజేసింది. నిన్నటితో పోలిస్తే మరింత పెద్ద సైజులో ఈ ప్రకటనలు ఇచ్చింది. -
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!