Corona Vaccine: టీకా పొందిన వారి ద్వారా కూడా ‘డెల్టా’ వ్యాప్తి
కరోనా వైరస్లో ఉద్ధృతంగా వ్యాపించే డెల్టా రకానికి సంబంధించి పరిశోధకులు ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. టీకాలు పొందినవారు కూడా.. ఇంటి వాతావరణంలో ఈ వేరియంట్ బారినపడొచ్చని, వారి ద్వారా అది ఇతరులకూ వ్యాపించొచ్చని
లండన్: కరోనా వైరస్లో ఉద్ధృతంగా వ్యాపించే డెల్టా రకానికి సంబంధించి పరిశోధకులు ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. టీకాలు పొందినవారు కూడా.. ఇంటి వాతావరణంలో ఈ వేరియంట్ బారినపడొచ్చని, వారి ద్వారా అది ఇతరులకూ వ్యాపించొచ్చని పేర్కొన్నారు. అయితే టీకా వేయించుకోని వారితో పోలిస్తే ఇలాంటివారి ద్వారా వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని తెలిపారు. బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఆ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్ ఇన్ఫెక్షస్ డిసీజెస్’లో ప్రచురితమయ్యాయి. వ్యాక్సిన్ పొందినవారిలో ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే గరిష్ఠ వైరల్ లోడు మాత్రం ఇతరులతో సమానంగానే ఉంటుందన్నారు. వారి ద్వారా ఇళ్లల్లో వైరస్ వ్యాప్తి జరగడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. ‘‘కొవిడ్ వ్యాప్తి చాలా వరకూ గృహాల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్నది తెలిసిన విషయమే. అయితే వ్యాక్సిన్ పొందినవారి ద్వారా గృహాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి గురించి పెద్దగా వివరాలు అందుబాటులో లేవు. మహమ్మారిని అదుపు చేయడానికి టీకాలు కీలకం. కొవిడ్ సోకినవారిని తీవ్ర అనారోగ్యం, మరణం బారి నుంచి కాపాడటంలో అవి సమర్థత చాటుతున్నాయి. అయితే ఇళ్లల్లో డెల్టా రకం వ్యాప్తిని అడ్డుకోవడంలో వ్యాక్సినేషన్ ఒక్కటే సరిపోదని మా అధ్యయనం చెబుతోంది’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ అజిత్ లాల్వానీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్