TS News: సూర్యాపేట జిల్లా వైద్యాధికారికి కరోనా.. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన కుమారుడు

సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కోటాచలం కరోనా బారిన పడ్డారు. ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ .. రెండు టెస్టుల్లోనూ గురువారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది

Updated : 02 Dec 2021 21:12 IST

తాళ్లగడ్డ: సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కోటాచలం కరోనా బారిన పడ్డారు. ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌.. రెండు టెస్టుల్లోనూ గురువారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదు రోజుల క్రితం ఆయన కుమారుడు విదేశాల నుంచి తిరిగి రావడం కలకలం రేపుతోంది. విదేశాల నుంచి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులంతా తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి.. రెండు రోజుల క్రితమే తిరిగి స్వగ్రామం తిరుమలగిరికి చేరుకున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకోగా ఆరుగురికి   కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని