Ts News: ఖమ్మం జిల్లా చింతకాని జడ్పీ పాఠశాలలో కరోనా కలకలం
ఖమ్మం జిల్లా చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగింది. పాఠశాలలో చదువుతున్న ఐదురుగు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. వారిలో ముగ్గురు
చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగింది. పాఠశాలలో చదువుతున్న ఐదురుగు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. వారిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. చింతకాని జడ్పీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో గమనించిన పాఠశాల సిబ్బంది వైద్య పరీక్షల నిమిత్తం విద్యార్థిని చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించగా విద్యార్థికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తక్షణమే వైద్య సిబ్బంది శిబిరం ఏర్పాటు చేసి పాఠశాలలో ఉన్న 95 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు, పాఠశాల అటెండర్కు పరీక్షలు నిర్వహించారు. వారిలో మరో నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పాజిటివ్ నిర్ధారణ అయిన వారిలో ఇద్దరు విద్యార్థులు స్వల్పంగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారని మండల వైద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. కొవిడ్ బారినపడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మండల వైద్యాధికారి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.