AndhraPradesh : అప్పుడే డీఏ ఇస్తే రూ. 10 వేల కోట్లు మిగిలేవి: ఏపీ సీఎస్
కరోనా వల్ల రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..
అమరావతి: కరోనా వల్ల రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తెలిపారు. సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులతో కలిసి సీఎస్ విలేకర్లతో మాట్లాడారు. ఆందోళనలు, ధర్నాలు, సమ్మెల వల్ల ఏమీ రాదని, చర్చిస్తేనే కదా సమస్యలు పరిష్కారమయ్యేదన్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు ఎప్పుడూ సిద్ధమని చెప్పారు. ఎక్కడ జీతం తగ్గిందో చెబితేనే కదా తెలిసేదని పేర్కొన్నారు. రెండున్నరేళ్లుగా మధ్యంతర భృతి ఇస్తున్నామన్నారు. మధ్యంతర భృతి అనేదాన్ని ఎక్కడో ఒక చోట అడ్జెస్ట్ట్ చేయాలని చెప్పారు. హెచ్ఆర్ఏపై చర్చిస్తేనే కదా సమస్యలు తెలిసేదన్నారు.
తెలంగాణలా తాము కూడా అప్పట్లోనే డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లు మిగిలేదని సీఎస్ సమీర్ శర్మ వ్యాఖ్యానించారు. తెలంగాణలా తాము డీఏ ఇవ్వలేదని, ఐఆర్ ఇచ్చామని పేర్కొన్నారు. ఉద్యోగులకు సమస్యలున్న మాట నిజమని, చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. పే స్లిప్లో పది రకాల విషయాలు ఉంటాయని, అన్నీ సరి చూసుకోవాలని తెలిపారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీ పోల్చి చూడాలన్నారు. పే స్లిప్లో అన్ని విషయాలు చూస్తే జీతం పెరిగిందని వివరించారు. 11వ పీఆర్సీలో 27 శాతం ఐఆర్ను 30 నెలలపాటు ఇచ్చామన్నారు. ఉద్యోగులకు ఐఆర్ రూపంలో రూ. 18 వేల కోట్లను ఇచ్చినట్లు సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. ఐఆర్ అనేది వడ్డీ లేని రుణం.. దాన్ని సర్దుబాటు చేయాల్సిందేనని తెలిపారు. పే స్లిప్ చూస్తే జీతం పెరిగిందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేర్కొన్నారు. ఐఆర్ జీతంలో భాగం కాదన్నారు. పాత, కొత్త పీఆర్సీల మధ్య ఇచ్చే ఆర్థిక వెసులుబాటే ఐఆర్ అని శశి భూషణ్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్