Hyderabad News: అర్ధరాత్రి వ్యాయామం.. మందలించిందని తల్లిని చంపేశాడు

అర్ధరాత్రి వ్యాయామం చేస్తుంటే తల్లి మందలించిందని కుమారుడు ఆమెను చంపేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది.

Updated : 25 Jan 2022 03:06 IST

హైదరాబాద్‌: అర్ధరాత్రి వ్యాయామం చేస్తుంటే తల్లి మందలించిందని కుమారుడు ఆమెను చంపేసిన ఘటన నగరంలోని సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామ్‌కోటి ప్రాంతానికి చెందిన కొండ పాపమ్మ తన కుమారుడు సుధీర్‌కుమార్‌, కుమార్తెతో కలిసి సుల్తాన్‌ బజార్‌లో నివాసం ఉంటోంది. భర్త లేని పాపమ్మ కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన సుధీర్‌కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గత ఏడాది కాలంగా చికిత్స జరుగుతోంది.

ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సుధీర్‌ డంబెల్స్‌తో వ్యాయామం చేయడం మొదలుపెట్టాడు. ఈ సమయంలో వ్యాయామం చేయడం ఏంటని అతడిని తల్లి వారించింది. దాంతో కోపోద్రిక్తుడైన సుధీర్‌ డంబెల్స్‌తో ఆమె తలపై మోది హతమార్చాడు. అడ్డువచ్చిన చెల్లిని కూడా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేని నిందితుడిని, అతడి సోదరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని